సూపర్ స్టార్ రజనీకాంత్ 168వ చిత్రం కొద్దిసేపటి క్రితం ఘనంగా లాంచ్ అయింది. చిత్ర బృందం పూజా కార్యక్రమాలు జరిపారు. లాంచింగ్ కార్యక్రమానికి రజనీకాంత్తో పాటు మీనా, ఖుష్బూ, దర్శకుడు శివ, నిర్మాతలు హాజరయ్యారు. వేరే సినిమా షూటింగ్తో బిజీగా ఉండడం వలన కీర్తి సురేష్ లాంచింగ్ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినట్టు తెలుస్తుంది. 24 ఏళ్ళ తర్వాత రజనీకాంత్, మీనా కలిసి నటిస్తున్నారు. ముత్తు సినిమాలో చివరిగా వీరిద్దరు కలిసి కనిపించారు. ఇక చిత్రంలో మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఖుష్బూ చివరిగా పాండియన్ చిత్రంలో రజనీకాంత్తో కలిసి నటించింది. 27 ఏళ్ళ తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తుండడం విశేషం. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్లో తొలి షెడ్యూల్ జరుపుకోనున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ చెన్నైలో జరుపుకోనుంది.
previous post