ఇటీవలే రాజకీయాలలో అరంగేట్రం చేసిన కమల్ హాసన్ మరియు రజినీకాంత్ లు చాలా కాలం తరువాత ఒకచోట కలిశారు. రజనీ తన ఇంటిలో అడుగుపెట్టగానే కమల్ ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. అనంతరం ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. వీరిద్దరూ ఇప్పుడు కలవడానికి కారణం, రజనీకాంత్ కుమార్తె సౌందర్య వివాహం, ఈ నెల 11న చెన్నైలో జరగనుంది. దానికి ఆహ్వానించేందుకు రజనీకాంత్, కమల్ ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించాడు.
ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త అయిన విషగన్ వనంగమూడిని సౌందర్య పెళ్లి చేసుకోబోతున్నారు. రజనీ ఇంట ఇప్పటికే పెళ్లి వేడుకలు ప్రారంభం కాగా, అతిథులను ఆహ్వానించే పనిలో ‘తలైవా’ బిజీగా ఉన్నాడు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్న రజనీకాంత్ తొలి ఆహ్వాన పత్రికను మాత్రం తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తిరునవుక్కరాసర్కు అందించి పెళ్లికి ఆహ్వానించారు. అనంతరం రజనీకాంత్ మాట్లాడుతూ.. సౌందర్య పెళ్లి వెనక తిరు ప్రధాన పాత్ర పోషించారని, అందుకే ఆయనకు తొలి పత్రికను అందించి ఆహ్వానించినట్టు చెప్పారు.
నెపోటిజం అంటూ సూర్య, విజయ్ పై మీరా మిథున్ తీవ్ర వ్యాఖ్యలు…!