telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాంగ్రెస్ బాగుపడాలంటే ఉత్తమ్ తప్పుకోవాలి: రాజగోపాల్‌రెడ్డి

pcc notices to komatireddy rajagopal

తెలంగాణలో కాంగ్రెస్ బాగుపడాలంటే పీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తప్పుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్‌తో ఉత్తమ్ మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఉన్నారని ఆరోపించారు. ఉత్తమ్‌కు రామేశ్వరరావుతో కూడా సంబంధాలున్నాయని ఆరోపించారు.

చంద్రబాబు ప్రచారంతో పాటు పొత్తుల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని విమర్శించారు. గ్రూపు రాజకీయాలతో పార్టీని ఉత్తమ్ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. తాము గాంధీభవన్ నేతలం కాదని, ప్రజల మనుషులమని అన్నారు. కాంగ్రెస్ నేతలకు ప్రజలే షోకాజ్ నోటీసులిస్తారని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఈ దుస్థితికి రావడానికి కారణం నాయకత్వ లోపమేనని చెప్పారు.

Related posts