యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న జంటగా ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరి 21న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ అండ్ హౌస్ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రంపై మానవ హక్కుల కమీషన్కు ఫిర్యాదు చేశారు గంగపుత్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్. భీష్మ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, అలాంటి సన్నివేశాలను వెంటనే తొలగించాలని రాజేశ్వర్.. మానవ హక్కుల కమీషన్కు ఫిర్యాదు చేశారు. సినిమా విడుదలై 20రోజులకు పైగా పూర్తయిన తర్వాత ఇటువంటి ఫిర్యాదుతో చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది.