మన దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్ లు విధిస్తుంటే మరి కొన్ని పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నాయి. తాజాగా ఆ లొస్త్ లో మరి రాష్ట్రం చేరిపోయింది. రాజస్ధాన్ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ సంపూర్ణంగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈనెల 11 వ తేదీ నుంచి మే 24 వ తేదీ వరకు మొత్తం 14 రోజులపాటు లాక్డౌన్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ అమలులో ఉన్న 14రోజులు పెళ్లిళ్లు, అంతర్రాష్ట్ర సర్వీసులు, ఉపాదిహామీ పనులు వంటివి ఏమీ ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. మే 31 వ తేదీ తరువాతే, పెళ్లిళ్లను అనుమతిస్తామని, ఇప్పటికే ఫంక్షన్ హాల్స్ వంటివి బుక్ చేసుకుంటే వాటిని క్యాన్సిల్ చేసుకోవాలని లేదంటే, నిర్వాహకులతో మాట్లాడి సర్దుబాటు చేసుకోవాలని సర్కార్ సూచించింది. అయితే చూడాలి మరి ఇంకా ఎన్ని రాష్ట్రాలు ఈ లిస్ట్ లో చేరుతాయి అనేది.
previous post