telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

రాజ‌స్ధాన్ లో సంపూర్ణ లాక్‌డౌన్…

మన దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్ లు విధిస్తుంటే మరి కొన్ని పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నాయి. తాజాగా ఆ లొస్త్ లో మరి రాష్ట్రం చేరిపోయింది. రాజ‌స్ధాన్ రాష్ట్రంలో క‌రోనా లాక్‌డౌన్ సంపూర్ణంగా అమ‌లు చేయాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది.  ఈనెల 11 వ తేదీ నుంచి మే 24 వ తేదీ వ‌ర‌కు మొత్తం 14 రోజుల‌పాటు లాక్‌డౌన్ ను అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న 14రోజులు పెళ్లిళ్లు, అంత‌ర్రాష్ట్ర స‌ర్వీసులు, ఉపాదిహామీ ప‌నులు వంటివి ఏమీ ఉండ‌వ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.  మే 31 వ తేదీ త‌రువాతే, పెళ్లిళ్లను అనుమ‌తిస్తామ‌ని, ఇప్ప‌టికే ఫంక్ష‌న్ హాల్స్ వంటివి బుక్ చేసుకుంటే వాటిని క్యాన్సిల్ చేసుకోవాల‌ని లేదంటే, నిర్వాహ‌కుల‌తో మాట్లాడి స‌ర్దుబాటు చేసుకోవాల‌ని స‌ర్కార్ సూచించింది. అయితే చూడాలి మరి ఇంకా ఎన్ని రాష్ట్రాలు ఈ లిస్ట్ లో చేరుతాయి అనేది.

Related posts