యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో” టీజర్ కొద్ది నిమిషాల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్లో ప్రభాస్ చేస్తున్న స్టంట్స్ , యాక్షన్ సీన్స్ సామాన్య జనాలనే కాక సెలబ్రిటీలని కూడా ఆకట్టుకుంటున్నాయి. 150 కోట్ల బడ్జెట్తో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర చివరి షెడ్యూల్ జరుగుతుండగా, ఆగస్ట్ 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. హాలీవుడ్ రేంజ్లో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్పై సుధీర్ బాబు, నితిన్, సురేందర్ రెడ్డి, సాయి ధరమ్ తేజ్, మారుతి, సుధీర్ వర్మ, బెల్లంకొండ శ్రీనివాస్ , పూరీ జగన్ తదితరులు చిత్ర టీజర్పై ప్రశంసలు కురిపించారు. తాజాగా దర్శకుడు రాజమౌళి కూడా “సాహో” టీజర్పై స్పందించారు. “టెర్రిఫిక్ టీజర్. నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్, దర్శకుడు సుజీత్ సమ న్యాయం చేశారు. ప్రభాస్ హ్యాండ్సమ్గా, డార్లింగ్లా కనపడుతున్నారు” అన్నారు రాజమౌళి.
next post