telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా”పై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు

Rajamouli

“ఖైదీ నెంబర్ 150″తో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి… ఆ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుని తనకు ఇంకా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపించుకున్నారు. ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ తో తన కలల ప్రాజెక్ట్ “సైరా”ను తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా పట్టాలెక్కించాడు చిరు. ఈ సినిమా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను అన్ని ప్రాంతీయ భాషలలో విడుదల చేస్తున్నారు. మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వివాదాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4620 థియేటర్లలో “సైరా” విడుదలైంది. సైరా విడుదల నేపథ్యంలో చిరు అభిమానులు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు. తారస్థాయిలో ఉన్న అంచనాలను అందుకుంటూ ఘనవిజయంగా నిలిచింది. ‘బాహుబలి’తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి ‘సైరా’ సినిమాను ప్రశంసలతో ముంచెత్తారు. “శ్రీ ఉయ్యలవాడ నర్సింహారెడ్డిగారి పాత్రలో చిరంజీవిగారు జీవం పోశారు. చరిత్ర మరిచిపోయిన వ్యక్తిని స్మరణకు తెచ్చారు. జగపతిబాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా.. ఇలా ప్రతీ పాత్ర కథలో భాగమవుతూ మరింత ఆసక్తిని కలిగించాయి. బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రామ్‌చరణ్‌కు హృదయపూర్వక అభినందనలు” అని రాజమౌళి ట్వీట్ చేశారు.

Related posts