బుల్లితెరపై పాపులర్ అయిన “జబర్దస్త్” కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ఎంతగానో ప్రజాదరణ పొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రేటింగ్స్ విషయంలో కూడా జబర్దస్త్ ఎప్పుడూ అందనంత ఎత్తులోనే ఉంటుంది. గురు,శుక్ర వారాల్లో ప్రసారమయ్యే ఈ షోకు ఇంత పాపులారిటీ రావడానికి కారణం రష్మి-సుధీర్ జంటకు జనాల్లో బీభత్సమైన క్రేజ్ ఉంది. ఇటీవలే జబర్దస్త్ స్టేజిపై కొత్త కెమిస్ట్రీ నడుస్తోంది. అదే యాంకర్ అనసూయ, హైపర్ ఆది అల్లరి..! గ్యాప్ లేకుండా పంచులేసే ఆది..ఈ మధ్య వరసగా అనసూయతో స్టెప్పులేస్తున్నాడు. స్కిట్లోనూ ఆమెతో డైలాగ్లు చెప్పిస్తున్నాడు. దాంతో రష్మి-సుధీర్ మాదిరిగానే.. అనసూయ-ఆది జంటకు ఫాలోయింగ్ పెరుగుతోంది. వీరిద్దరి కెమిస్ట్రీపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆది-అనసూయ జంటపై జబర్దస్త్ కమెడియన్ రైజింగ్ రాజు ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. స్కిట్లో ఏదైనా ఒక బిట్ జనాల్లోకి బాగా వెళ్తే.. అలాంటి వాటిపై డైరెక్టర్లు ఎక్కువగా స్కిట్లు రాస్తారని చెప్పుకొచ్చారు. ఆది-అనసూయ కెమిస్ట్రీ కూడా అలాంటిదేనని స్పష్టం చేశారు. తామంతా ఒక కుటుంబమని.. అనసూయను తమ సోదరిగా, కూతురిగా భావిస్తామని స్పష్టంచేశారు.