ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వాతావరాణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ నెల 19న రాష్ట్రానికి రుతుపవనాలు రానున్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది. అనంతపురం, చిత్తూరు జిల్లాలను రుతుపవనాలు తాకనున్నాయని స్పష్టంచేసింది. రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 19 నుంచి 24వ తేదీలోపు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది.
అలాగే ఈ నెల 18 వరకు ఎండల తీవ్రత కొనసాగతుందని స్పష్టం చేసింది. కోస్తా జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. ప్రతీ జిల్లాలో 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటినట్లు పేర్కొంది. విజయనగరం జిల్లా కనిమెరకలో అత్యధికంగా 46.20 డిగ్రీలు నమోదైనట్లు వెల్లడించింది.