telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

రైళ్లలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం.. అక్టోబర్ 2 నుంచి అమలు!

special train between vijayawada to gudur

రైళ్లలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి రైల్వే శాఖ చెక్ పెట్టనుంది. ఇకపై రైళ్లలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ మెటీరియల్ వాడకాన్ని నిషేధించనున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పలు రైల్వే విభాగాలను ఆదేశించింది. , స్వాతంత్ర్య దినోత్సవ రోజున ప్రధాని పిలుపు మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Related posts