రైళ్లలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి రైల్వే శాఖ చెక్ పెట్టనుంది. ఇకపై రైళ్లలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ మెటీరియల్ వాడకాన్ని నిషేధించనున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పలు రైల్వే విభాగాలను ఆదేశించింది. , స్వాతంత్ర్య దినోత్సవ రోజున ప్రధాని పిలుపు మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.