telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర రైల్వే మంత్రి…

ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్. నిన్న అర్ధరాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వాగతం పలికారు.  అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని ఇవాళ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి పీయూష్ గోయల్. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశ్వీరదించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. భారత్ బలమైన దేశంగా మరోసారి రుజువు చేసుకుందని… ఏ దేశం సహకారం లేకుండా ఆత్మనిర్బర్ భారత్ స్ఫూర్తితో కరోనా పై విజయం సాధిస్తూన్నామని…. 150 దేశాలకు కరోనా సమయంలో మందులు సరఫరా చెయ్యగా…. 75 దేశాలకు కరోనా వ్యాక్సిన్ సరఫరా చేసిన ఘనత భారత్ దే అన్నారు గోయల్. రైల్వే సదుపాయం ప్రయాణికుల అవసరాలను బట్టి పునరుద్దరణ చేస్తామని అన్నారు. ఇక మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.గంటా శ్రీనివాస్ తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశ్వీరదించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Related posts