telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. 78 రోజుల బోన‌స్‌ చెల్లింపు!

special train between vijayawada to gudur

కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది వారికి 78 రోజుల వేత‌నాన్ని బోన‌స్‌గా చెల్లించ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. క్యాబినెట్ మీటింగ్ త‌ర్వాత మాట్లాడుతూ.. సుమారు 11 ల‌క్ష‌ల 52వేల మంది రైల్వే ఉద్యోగుల‌కు బోన‌స్ ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు.

ఉద్యోగుల్లో ప్రేర‌ణ నింపేందుకు బోన‌స్‌ను ప్ర‌క‌టిస్తున్న‌ట్లు రైల్వే శాఖ పేర్కొన్న‌ది. త‌మ ప్ర‌భుత్వం గ‌త ఆరేళ్ల నుంచి రికార్డు స్థాయిలో రైల్వే ఉద్యోగుల‌కు బోన‌స్ ఇస్తున్న‌ట్లు మంత్రి జ‌వ‌దేక‌ర్ తెలిపారు.

Related posts