105 రోజుల బిగ్ బాస్ నాగార్జున హోస్ట్గా 17 మంది కంటెస్టెంట్స్తో జూలై 21 ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో ఆదివారం నాడు విజేతను ప్రకటించారు. బిగ్బాస్ తెలుగు 3 టైటిల్ను సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ రూ.50లక్షల నగదు బహుమతిని దానితో పాటు ఓ ట్రోఫీని అందుకున్న విషయం తెలిసిందే. ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. ఈ సందర్భంగా రాహుల్ పేరెంట్స్ను ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూ చేయగా.. రాహుల్ తల్లి సుధారాణి ఆసక్తికర విషయం వెల్లడించారు. బిగ్బాస్ షోలో తనకు శ్రీముఖి అంటేనే ఇష్టమని ఆమె తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. శ్రీముఖి ఏది చేసినా అందరినీ నవ్విస్తుందని, చాలా అందంగా కనిపిస్తుందని ప్రశంసించారు. “రాహుల్-శ్రీముఖి మధ్య టఫ్ ఫైట్ నడిచినా.. మా అబ్బాయి మాటల్లో నిజాయితీ ప్రేక్షకులకు నచ్చింది. అందుకే ఎక్కువ ఓట్లు వేసి గెలిపించారు. శ్రీముఖి కూడా చాలా బాగా ఆడింది. చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా మా అబ్బాయి ట్రోఫీ అందుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది” అని సుధారాణి చెప్పారు.
previous post