telugu navyamedia
రాజకీయ వార్తలు

జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ కు రాహుల్‌ కౌంటర్‌

rahul gandhi to ap on 31st

జమ్మూకశ్మీర్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయంటూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ విమర్శించిన సంగతి తెలిసిందే. రాహుల్ కు విమానం పంపిస్తామని, కశ్మీర్ పరిస్థితిని కళ్లారా చూసి మాట్లాడాలన్నారు. అయితే గ‌వ‌ర్న‌ర్ మాలిక్ వ్యాఖ్య‌ల‌కు రాహుల్ గాంధీ కౌంట‌ర్ ఇచ్చారు.

కశ్మీర్ అంశాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారని… ప్రజల్లో అస్థిరతను సృష్టించాలనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా రాహుల్ గాంధీ స్పందించారు. డియర్‌ మాలిక్‌ జీ.. నా ట్వీట్‌పై మీ పస లేని స్పందన చూశాను. జమ్మూకవ్మీర్‌కు రావాలన్న మీ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నాను. ఎలాంటి షరతులు లేకుండా అక్కడి ప్రజలను కలుస్తాను. నేను ఎప్పుడు రావొచ్చు? అని సత్యపాల్‌ మాలిక్‌కు కౌంటర్‌ ఇస్తూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

Related posts