కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్ చేరుకున్నారు. అక్కడి ఎయిర్ పోర్టులో రాహుల్కు ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. ఈ రెండు రోజుల్లో ఆయన దుబాయ్, అబు దాబిలలో పర్యటించనున్నారు. తొలిరోజు పర్యటనలో రాహుల్.. భారతీయ విద్యార్థులతో సమావేశం కానున్నారు.
అనంతరం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ‘ఇండో అరబ్ కల్చరల్ పోగ్రామ్’కు ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. రెండవ రోజు ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. రాహుల్ గతంలో అమెరికా, లండన్, జర్మనీ, బహ్రెయిన్లలో పర్యటించిన విషయం తెలిసిందే. దుబాయ్ పర్యటనలో రాహుల్తో పాటు కేంద్ర మాజీ మంత్రి శ్యామ్ పిట్రోడా కూడా ఉన్నారు.
పవన్ అలా మాట్లాడడం సరికాదు: కేటీఆర్