telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

31న విజయవాడలో .. రాహుల్ గాంధీ బహిరంగ సభ..

rahul gandhi to ap on 31st

ఈనె 31వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విజయవాడ వస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని సమీపంలో నిర్వహించనున్న పార్టీ భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, వివిధ రాష్ట్రాల్లో ప్రచారం, సొంత నియోజకవర్గం అమెథీలో గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో క్షణం తీరికలేకుండా బిజీగా ఉన్న రాహుల్‌ ఏపీ పర్యటనకు ఓ రోజు కేటాయించడం గమనార్హం.

పార్టీ చీఫ్‌ వస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు అవసరమైన ఏర్పాట్లలో మునిగి ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి అంతంతగా ఉన్న నేపథ్యంలో విజయవాడ సభలో ప్రసంగించనున్న రాహుల్‌గాంధీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని, ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు ఉత్సాహాన్ని నింపుతారని భావిస్తున్నారు.

Related posts