కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథి – లోక్సభ స్ధానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్కు అందజేశారు. రాహుల్ వెంట ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, బావ రాబర్ట్ వాద్రా ఉన్నారు. నామినేషన్ దాఖలు కంటే ముందు అమేథిలో రాహుల్, ప్రియాంక గాంధీ రోడ్షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో రాబర్ట్ వాద్రాతో పాటు వారి పిల్లలు రేహన్, మిరాయా కూడాపాల్గొన్నారు.
గాంధీల కుటుంబానికి కంచుకోట అమేధిలో రాహుల్ ఇప్పటికి మూడుసార్లు గెలుపొందారు. అమేధిలో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో తలపడనున్నారు. మరోవైపు అమేధితో పాటు కేరళలోని వయనాడ్లోనూ పోటీచేస్తున్న రాహుల్ ఇప్పటికే అక్కడ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు నివాసంపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు