telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

తిరుమల చేరుకున్న .. రాహుల్..

rahul gandhi in tirumala for darsan

నేడు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుపతిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన శ్రీవారిని దర్శించ దలచి కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. అలిపిరిలో ఉదయం 11:40 గంటల సమయంలో నడక ప్రారంభించి మధ్యాహ్నం 1:30 గంటలకు కొండపైకి చేరుకున్నారు. కేవలం గంటా 50 నిమిషాల వ్యవధిలోనే తిరుమలకు చేరుకున్నారు. మేనల్లుడు రేహాన్‌ వాద్రాతో కలసి పోటీపడుతూ నడిచారు.

నడక మార్గంలో ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా సుమారు 3500లకు పైగా మెట్లు ఎక్కారు. జీఎన్‌సీ ప్రాంతం నుంచి నడుస్తూనే అతిథి గృహానికి చేరుకున్నారు. గాలిగోపురం వద్ద సాధారణ భక్తుడిలా దివ్యదర్శనం టోకెన్లను పొందారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు.

Related posts