వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలను అడ్డుకోవాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు వేరే పార్టీ లెటర్ హెడ్పై షోకాజ్ నోటీసులు ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యానని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్పై షోకాజ్ నోటీసు ఇచ్చారని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తాను ఎక్కడా పాల్పడలేదన్నారు. కానీ వైసీపీ ఆ ఎంపీలు అదే కారణం చూపిస్తూ అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్తున్నారని పేర్కొన్నారు. అత్యవసర పిటిషన్లను మాత్రమే విచారిస్తున్న హైకోర్టు.. ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ను సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.