telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చవకబారు వ్యాఖ్యలు చేయొద్దు.. మంత్రులపై రఘురామ ఫైర్

Raghuramakrishnaraju ycp mp

ఏపీ మంత్రులపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొత్స, ఇతర మంత్రులపై విరుచుకుపడ్డారు. నేను ఎలా గెలిచినా మీకు తెలుసని అన్నారు. నేను పార్టీలోకి ఎలా వచ్చానో కూడా మీకు తెలుసని చెప్పారు. 

నేనెలా వచ్చానో సీఎం జగన్ కు కూడా తెలుసు. ఏదైనా ఉంటే సీఎం జగన్ నేనూ చూసుకుంటాం. మధ్యలో ప్రతివాడు వాగొద్దు. మీకేదో మంత్రి పదవి ఉందని నోటికొచ్చింది వాగేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏదైనా ఉంటే నేను, సీఎం జగన్ చూసుకుంటాం. దయచేసి మంత్రులు చవకబారు ప్రకటనలు చేయకండని హితవు పలికారు. నా జోలికి రాకండి.. మీరెలా నెగ్గారో, నేనూ అలాగే నెగ్గానని అన్నారు. సత్తిబాబు గారూ నాకు సరదాగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేయొద్దని  హితవు పలికారు. 

Related posts