“డీ ఫర్ దోపిడీ”, “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” సినిమాల్లో నటించిన నవీన్ పోలిశెట్టి హీరోగా “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” చిత్రం తెరకెక్కింది. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇటీవలే విడుదలైంది. మొదటి షో నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు అనుకున్న ఈ సినిమాలో కామెడీతో పాటు ఆసక్తికర సన్నివేశాలు ఉన్నాయి. ఎఫ్బిఐ పేరుతో ఓ కార్యాలయాన్ని పెట్టి, కేసులను ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఈ క్రమంలో ఓ అమ్మాయి హత్య కేసును ఛేదించబోయిన హీరో మరో హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఈ కేసులో జైలుకు వెళ్తాడు హీరో. జైలులో ఉన్న హీరో తన కేసును తనే ఎలా చేధించాడనేది సినిమా కథ. రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన ఈ చిత్రంలో శృతి శర్మ కథానాయికగా నటించింది. ఇటీవల ఈ సినిమాను చూసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, హీరో నవీన్ పొలిశెట్టి, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా, దర్శకుడు స్వరూప్ సహా ఎంటైర్ యూనిట్ను పర్సనల్గా “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` టీమ్కు ఫోన్ చేశారు. అద్భుతమైన సినిమా చేశారంటూ ఎంటైర్ యూనిట్ను అభినందించారు దర్శకేంద్రుడు. సినిమాకు సంబంధించిన పలు విషయాలను యూనిట్తో దర్శకేంద్రుడు ముచ్చటించారు.