తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో షో ప్రసారం కాగా, దీనికి నాగార్జున, చిరు హోస్ట్లుగా వ్యవహరించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్గా రూపొందిన కార్యక్రమం కౌన్బనేగా కరోడ్ పతి. ఈ షోకి లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఇప్పటికి హిందీలో సక్సెస్ఫుల్గా ఈ షో నడుస్తుండగా, పలు ప్రాంతీయ భాషలలోను ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఇక తమిళంలోను “నీంగలుమ్ వెల్లాలుమ్ ఒరు కోడీ” పేరుతో ఓ షో ప్రసారం అయింది. మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోకు సూర్య, ప్రకాశ్రాజ్, అరవింద్స్వామిలు ఒక్కో సీజన్లో హోస్ట్లుగా వ్యవహరించారు. హిందీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్గా రూపొందిన కౌన్ బనేగా కరోడ్పతి(కేబీసీ) మాదిరి తమిళంలో ‘కోడీశ్వరి’(కోటీశ్వరి) గేమ్ షోను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్విజ్ షోకు రాధిక హోస్ట్గా ఉండనున్నారు. కలర్స్లో టీవీ ఛానెల్లో ప్రసారం కానున్న ఈ షోలో పాల్గొనేవారు కేవలం మహిళలు మాత్రమే ఉంటారని తెలుస్తుంది. డిసెంబర్ నుండి షో ప్రారంభం కానున్నట్టు సమాచారం. వెండితెరపై అసమాన నటిగా పేరు తెచ్చుకున్న రాధికా శరత్ కుమార్ బుల్లితెరపై హోస్ట్గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. పలు టీవీ సీరియల్స్లో నటించిన రాధికా తొలిసారి హోస్ట్గా దర్శనమివ్వనున్నారు.
கலர்ஸ் தமிழ் பெருமையுடன் வழங்கும் உலகத்தின் மிகப்பெரிய வண்ணமயமான “கேம் ஷோ..!!”.
முதல்முறையாகப் பெண்கள் மட்டுமே கலந்துகொள்ளும் ஒரு பிரம்மாண்டமான மேடை ‘கோடீஸ்வரி’..!!#ColorsKodeeswari | #ColorsKOD | #ColorsTamil | @realradikaa pic.twitter.com/kt4FetFfaK
— Colors Tamil (@ColorsTvTamil) 17 October 2019
పెళ్లిపై ఇంట్రస్ట్ లేదు… వాళ్ళకోసమే అలా చెప్పా : సాయి ధరమ్ తేజ్