పలు విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో రాచకొండ కమిషనరేట్ పోలీసులు ముందు వరుసలో ఉంటారు. సోషల్ మీడియాను వినియోగించుకుంటూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చూపించిన వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా మరో ముఖ్యమైన సందేశాన్ని వారు ప్రసారం చేస్తున్నారు. ‘‘శానిటైజర్ లేకుంటే సబ్బు జేబులో పెట్టుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అనివార్యం. ఇతరులు ముట్టుకొన్న ఏ వస్తువును తాకినా 20 సెకన్ల పాటు చేతులను వెనుక ముందు కడుక్కోవటం మరువొద్దు’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
పింఛన్ల పంపిణీలో వైసీపీ నాయకులు రూ.50 లాక్కుంటున్నారు: నారా లోకేశ్