సత్యదేవ్, ఇషారెబ్బా జంటగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం “రాగల 24 గంటల్లో”. శ్రీరామ్’, ఫేమ్ ముస్కాన్ సేథ్, గణేశ్ వెంకట్రామన్ ఇతర పాత్రల్లో కనిపిస్తారు. శ్రీ నవ్హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం సమకూర్చారు. శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ ఈ సినిమాను సమర్పిస్తోంది. నవంబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ ఆసక్తిని కలిగించింది. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ను లెజెండరీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు బుధవారం విడుదల చేసారు. ఎన్నో ఆశలతో అందమైన అబ్బాయిని పెళ్లిచేసుకుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి తన లైఫ్లోకి రావడం గొప్ప అదృష్టంగా భావించాడు ఆ అబ్బాయి. మంచి సంపాదన, ప్రశాంతమైన జీవితం. కానీ, ఏం జరిగిందో తెలీదు.. ఆ అబ్బాయి హత్యకు గురయ్యాడు. పోలీసులు, హడావుడి, అసలు ఎవరు చంపారు అనే ప్రశ్నలతో ఆమెకు పిచ్చెక్కింది. ఆఖరికి తన భర్తను చంపింది తానేనని అంగీకరించింది ఆ అమ్మాయి… ఇదీ ట్రైలర్ కథ. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
‘అంతకు ముందుకు ఆ తరువాత’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన తెలుగమ్మాయి ఈషా రెబ్బా తెలుగు, తమిళ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వస్తోంది. అయితే ఇంకా ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. ఇప్పటి వరకు హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన ఈషా రెబ్బా.. తొలిసారి లేడీ ఓరియెండెట్ సినిమాలో నటించింది.
మా ఎన్నికలపై దర్శకేంద్రుడు స్పందన….