telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీసీలు రాజకీయంగా ఎదగకుండా కుట్రలు : కృష్ణయ్య

Krishnaiah bc

బీసీలు రాజకీయంగా ఎదగకుండా తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిదని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో మూడవ విడతలో బీసీలు ఎక్కువ సంఖ్యలో గెలిచేలా బీసీ సంఘర్షణ సమితి కృషి చేయాలని ఆయన సూచించారు.

బీసీ కులాలను ఏకం చేసి బీసీ హక్కుల సాధన, రాజ్యాంగబద్ధమైన సంస్థలు, చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా బీసీ సంఘర్షణ సమితి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీసీలకు జనాభా ప్రతిపాదికన రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లను అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో పెట్టి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Related posts