telugu navyamedia
రాజకీయ వార్తలు

ఈవీఎంల‌పై ఆరోప‌ణ‌లు బోగ‌స్: బీహార్ సీఎం

CM Nitish Kumar

ఈవీఎంల‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు బోగ‌స్ అని బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. అమిత్ షా విందులో పాల్గొనేందుకు ఢిల్లీ వ‌చ్చిన మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంల‌ను ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాతే ఎన్నిక‌లు పార‌ద‌ర్శ‌కంగా జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. ఈవీఎంలు అనేవి టెక్నాల‌జీకి సంబంధించిన అంశం అని తెలిపారు.

ఈవీఎంల‌పై అనుమానాలు వ్య‌క్తం చేసిన‌ప్పుడ‌ల్లా ఈసీ త‌గిన స‌మాధానం ఇచ్చింద‌న్నారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యే పార్టీలే ఈవీఎంల‌పై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయ‌ని తెలిపారు. ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేయరాదు అన్నారు. అయోధ్య వివాదాన్ని కోర్టు ప్ర‌మేయంతోనే లేక ఇరువురి ఒప్పందంతోనే ప‌రిష్క‌రించాల‌న్నారు.

Related posts