బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం కన్నుముశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న క్వీన్ ఎలిజబెత్ 2 (96) గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు.
బ్రిటన్ను దీర్ఘకాలం పాలించిన రాణిగా తన పేరును రికార్డుల్లో సుస్థిరం చేసుకున్నారు. ఆమె దాదాపు 70 సంవత్సరాల పాటు బ్రిటన్ కు రాణిగా ఉన్నారు.
బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 మరణించినట్టు బకింగ్హామ్ ప్యాలెస్ ప్రకటించింది. బల్మోరల్ ఎస్టేట్లో ఆమె గురువారం మధ్యాహ్నం కన్నుమూసినట్టు వివరించింది.
రాజ కుటుంబ సభ్యులు… క్వీన్స్ కుమారుడు, వారసుడు ప్రిన్స్ చార్లెస్, మనవలు విలియం మరియు హ్యారీ, వారి కుటుంబాలు – స్కాటిష్ హైలాండ్స్లోని ఆమె బాల్మోరల్ రిట్రీట్ వద్ద కు వచ్చి చేరుకున్నారు.
గురువారం మధ్యాహ్నం ఆమె అనారోగ్యం పాలైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో రాణి మనవడు ప్రిన్స్ విలియం కూడా ఆమెతో ఉన్నారు.
అనారోగ్యం కారణంగా, రాణి బల్మోరల్ ప్యాలెస్లో నివసిస్తున్నారు. ఆమె ఈ రాజభవనం నుంచి అధికారిక పనులన్నీ చేసేది. బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ సెప్టెంబర్ 6న ఇక్కడికి వచ్చి ఆమెను కలుసుకుని ప్రమాణ స్వీకారం చేశారు.
రాణి ఎలిజబెత్-2 మరణంపై బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ సంతాపం తెలిపారు. ఆమె మృతి సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం 10 రోజుల సంతాప దినాలు ప్రకటించింది.
ప్రజల దృష్టిని మళ్లించేందుకే షర్మిల వివాదం