నగరంలోని మాదాపూర్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి క్యూనెట్ సంస్థలో పెట్టుబడి పెట్టాడు, అయితే మోసపోయాను అని తెలియటంతో ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో అరవింద్ పని చేస్తున్నాడు. స్థానిక చంద్రానాయక్ తండాలో నివసిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం క్యూనెట్ సంస్థలో రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు.
తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినా ఫలితం దక్కకపోవడంతో, మనస్తాపం చెందిన అరవింద్, నిన్న రాత్రి మాదాపూర్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అరవింద్ మృతి తో వారి కుటుంబం కన్నీటి పర్యంతం అయింది.
టీఆర్ఎస్ను ఎప్పటికైనా గద్దె దించేది తామే: ఉత్తమ్