టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ లో మండిపడ్డారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం పేదలకుకేటాయించిన నిధులను టీడీపీ నేతలు మింగేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
చంద్రబాబు నివాసం, ఆయన మంత్రుల ఇళ్లలో ఒక్కో మరుగుదొడ్డి ఆధునికీకరణ(రెనోవేషన్) కోసం రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షలు ఖర్చు పెట్టారని విమర్శించారు. ఇందుకోసం నకిలీ బిల్లులు సృష్టించారని ఆరోపించారు. చంద్రబాబు చివరకు మరుగుదొడ్లను కూడా వదిలిపెట్టలేదని ఈరోజు ట్విట్టర్ లో పేర్కొన్నారు.
కేంద్రం చెబుతున్నా వైసీపీ ప్రభుత్వానికి అర్థం కాలేదు: చంద్రబాబు