telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

నేడు మధ్యాహ్నం హైదరాబాద్ కు రానున్న సింధు

pv singhu into pre quarters

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ లో విజేతగా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధు అర్థరాత్రి ఇండియాకు చేరుకుంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఆమె దిగింది. ఆమె రాక గురించి అప్పటికే సమాచారాన్ని అందుకున్న మీడియా ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓ భారతీయురాలిని అయినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. నాకు ప్రతి క్షణమూ సహకరించిన కోచ్ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఏకపక్షంగా సాగిన ఫైనల్ పోరులో విశ్వ విజేతగా నిలిచి వరల్డ్ బ్యాడ్మింటన్ గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకుని తొలి భారతీయురాలిగా సింధూ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక సింధూ ఈ మధ్యాహ్నం హైదరాబాద్ కు రానుండగా ఆమెకు రాష్ట్ర బ్యాడ్మింటన్ ఫెడరేషన్ తో పాటు, అభిమానులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts