ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో టైటిల్ నెగ్గిన తొలి భారత షట్లర్ గా చరిత్ర సృష్టించిన తెలుగుతేజం పీవీ సింధుకు ఎక్కడికెళ్లినా నీరాజనాలు పడుతున్నారు. ఈ ఉదయం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సింధు కొద్దిసేపటి క్రితమే సొంతగడ్డపై అడుగుపెట్టింది.
ప్రత్యేక విమానంలో కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి ఢిల్లీ నుంచి బేగంపేట చేరుకుంది. హైదరాబాద్ చేరుకున్న సింధుకు ఘనస్వాగతం లభించింది. తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సింధుకు సాదర స్వాగతం పలికారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ దినకర్ బాబు కూడా ఎయిర్ పోర్టు వద్దకు వచ్చారు.