కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన హైదరాబాద్ కు వచ్చ్చారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఆయనను కలిసేందుకు వస్తున్నారు. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సోమవారం కేంద్ర కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది.
గ్రీన్లాండ్స్లోని హరిత ప్లాజా భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కిషన్రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపింది. అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బేజీపీ తరపున బరిలోకి దిగిన కిషన్ రెడ్డి ఓటమి చవిచూశారు. అనంతరం మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ గా విజయం సాధించారు. ఎంపీ గా గెలుపొందిన కిషన్ రెడ్డి కి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది.
చంద్రబాబు నివాసం చుట్టూ మంత్రుల చక్కర్లు: అచ్చెన్నాయుడు