telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పీవీ నరసింహారావు: కేసీఆర్

KCR cm telangana

సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పీవీ నరసింహారావు అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని నక్లెస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పీవీ జీవితమంతా సంస్కరణలతోనే సాగిందన్నారు. ఏ హోదాలో పనిచేసినా తాను చేయగలిగినంత గొప్ప పనులు చేసేవారన్నారు. తాను నమ్మింది, అనుకున్నది గొప్పగా చేసిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. ఆయన ప్రధాని అయ్యే సమయానికి దేశం అంధకారంలో ఉందిని తెలిపారు.

మన దేశంలోని బంగారాన్ని ఇతర దేశాల్లో పెట్టుకుంటోన్న సమయంలో, ఆర్థికంగా దేశ పరిస్థితి క్లిష్టంగా ఉన్న సమయంలో ప్రధాని మంత్రి పదవిని పీవీ చేపట్టారు. ఎంతో గొప్పగా దేశాన్ని ముందుకు నడిపించారు. అప్పటివరకు రాజకీయాల్లో లేని వ్యక్తిని మన్మోహన్ సింగ్‌ ను ఆర్థిక శాఖ మంత్రిని చేశారని కేసీఆర్ చెప్పారు. ఆయన ద్వారా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దేశం ఆర్థిక దుస్థితి నుంచి గట్టెక్కింది. విద్యా శాఖ పేరును కూడా హెచ్‌ఆర్‌డీగా మార్చారని, గురుకుల పాఠశాలలను ప్రారంభించారని తెలిపారు. . జైళ్ల శాఖలోనూ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని కేసీఆర్ తెలిపారు.

Related posts