చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కు వైసీపీ అధినేత జగన్ నివాసం వద్ద చేదు అనుభవం ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ఈసారి టికెట్ దక్కకపోవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సునీల్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం జగన్ నివాసమైన లోటస్పాండ్కు వచ్చారు.
దాదాపు రెండు గంటలపాటు జగన్ నివాసం వద్దే ఉన్నా ఆయనను లోపలికి అనుమతించలేదు. కాగా… అదే సమయంలో వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ నివాసం వద్దకు వచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సునీల్ ఎదురుపడినప్పటికీ రామచంద్రారెడ్డి ఏమాత్రం పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయారు. రామచంద్రారెడ్డి కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతో సునీల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారయని తెలుస్తోంది.