డైరెక్టర్ పూరి జగన్నాథ్తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట పవన్. పవన్ కల్యాణ్ ‘బద్రి’తో పూరి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ‘బద్రి’ తర్వాత పన్నెండేళ్లకు వీరి కలయికలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ వచ్చింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పవన్-పూరి కలసి పనిచేయబోతున్నారట. రీ-ఎంట్రీలో వరుస సినిమాలు కమిట్ అవుతున్న పవన్… తాజాగా పూరితో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇందులో పవర్స్టార్ని ముఖ్యమంత్రి పాత్రలో చూపించబోతున్నాడట డాషింగ్ డైరెక్టర్ పూరి. గతంలో మహేశ్ బాబుతో ‘జనగణమణ’ పేరుతో సినిమా ప్రకటించాడు పూరి జగన్నాథ్. అయితే ఆ చిత్రాన్ని మహేశ్ వాయిదా వేస్తూ వచ్చాడు. ‘జనగనమణ’ కథనే పవన్ కళ్యాణ్కి చెప్పాడట పూరి. అందులో కథానాయకుడు ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని వార్తలు వినపడుతున్నాయి. పవన్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో బిజీగా ఉన్నాడు. దాని తర్వాత ఇప్పటికే పట్టాలెక్కిన క్రిష్ మూవీ లైన్లో ఉంది. ఆ తర్వాత హరీశ్ శంకర్-మైత్రీ మూవీ మేకర్స్ సినిమా ఉంటుంది. ఆ తర్వాతే పవన్-పూరి మూవీ ఉండే ఛాన్స్ ఉందట.
previous post
వందలసార్లు పచ్చి బూతులు తిడుతున్నారు… సింగర్ చిన్మయి శ్రీపాద