telugu navyamedia
వార్తలు సామాజిక

పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం!

puri jagaannth yatra

దేశంలో అత్యంత ప్రాశస్త్యం ఉన్న పూరీ జగన్నాథ రథయాత్ర ఎట్టకేలకు ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ఊరట కలిగించేలా ఆదేశాలు ఇవ్వడంతో రథచక్రాలు ముందుకు కదిలాయి. ప్రతి ఏడాది లక్షల మంది హాజరయ్యే ఈ మహాయాత్రలో ఈసారి కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది. భక్తులు పాల్గొనరాదని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పూజారులు, ఆలయ సిబ్బంది మాత్రమే యాత్రలో పాల్గొంటున్నారు.

ఈ యాత్రలో పాల్గొనే మూడు రథాలను లాగేందుకు ఒక్కొక్కదానికి 500 మందిని మాత్రమే అనుమతిస్తూ సుప్రీం నిర్ణయించడంతో ఆ మేరకు మాత్రమే రథాలను లాగుతున్నారు. ఈ కార్యక్రమాన్ని టీవీ లైవ్ లో ప్రసారం చేయాలని సుప్రీం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

Related posts