దేశంలో అత్యంత ప్రాశస్త్యం ఉన్న పూరీ జగన్నాథ రథయాత్ర ఎట్టకేలకు ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ఊరట కలిగించేలా ఆదేశాలు ఇవ్వడంతో రథచక్రాలు ముందుకు కదిలాయి. ప్రతి ఏడాది లక్షల మంది హాజరయ్యే ఈ మహాయాత్రలో ఈసారి కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది. భక్తులు పాల్గొనరాదని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పూజారులు, ఆలయ సిబ్బంది మాత్రమే యాత్రలో పాల్గొంటున్నారు.
ఈ యాత్రలో పాల్గొనే మూడు రథాలను లాగేందుకు ఒక్కొక్కదానికి 500 మందిని మాత్రమే అనుమతిస్తూ సుప్రీం నిర్ణయించడంతో ఆ మేరకు మాత్రమే రథాలను లాగుతున్నారు. ఈ కార్యక్రమాన్ని టీవీ లైవ్ లో ప్రసారం చేయాలని సుప్రీం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.