పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సక్సెస్ఫుల్గా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచి రూ.75 కోట్ల గ్రాస్ను సాధించింది. ఈ సందర్భంగా శనివారం చిత్రయూనిట్ సక్సెస్మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ… “నేను ఈ మధ్య కాలంలో చేసిన రెండు మంచి పనులు ఏమైనా ఉన్నాయి అంటే.. అవి ఒకటి రామ్ను కలకడం, రెండోడి ఇస్మార్ట్ శంకర్ సినిమా తీయడం. అందరి ఆదరణతో ఈ సినిమా ఇస్మార్ట్ బ్లాక్బస్టర్ అయ్యింది. సినిమా చూసి చాలా మంది నా మిత్రులు అప్రిషియేట్ చేసారు. రామ్ ఎనర్జీ ఈ సినిమాను నిలబెట్టింది. ఈ సినిమా సక్సెస్టూర్కు వెళ్ళినప్పుడు అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. రామ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవడం ఆనందమేసింది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అన్నారు.
previous post