ఈ మధ్య కాలంలో పవన్ వరుసగా సినిమాలకు ఓకే చెప్తున్నాడు. అనుకున్న ప్లాన్లన్నింటినీ కరోనా వచ్చి తారుమారు చేసింది. ఈ మహమ్మారి రాకపోయి ఉంటే ఇప్పటికి కథ వేరే విధంగా ఉండేది. ఈ ఏడాది రెండు సినిమాలు వచ్చే ఏడాది రెండు సినిమాలతో పవన్ ప్రేక్షకులను థియేటర్ల ముందు క్యూలు కట్టేలా చేసేవాడు. పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాథ్ కాంబో కొత్త సినిమా రానుందట, అది కూడా అవినీతి నిర్మూలన కథాంశంతో తెరకెక్కనుందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది ఇంకా తెలియదు. అయితే పవన్ ఇప్పటికే నాలుగు సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇప్పుడు తాజాగా పూరీతో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. పూరీ దర్శకత్వంలో బండ్ల గనేష్ ఓ సినిమా నిర్మంచనున్నాడని, అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేయనున్నాడని అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ఎన్నికల ముందే పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమా అవినీతి నిర్మాలనకు పోరాడే వ్యక్తి ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ వకీల్సాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే క్రిష్ దర్శకత్వంలో అయ్యపనుమ్ కోషియుమ్ రీమేక్లో నటించనున్నాడు.
previous post