పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తయారైన ‘ఇస్మార్ట్ శంకర్’ విడుదల తేదీ వాయిదా పడింది. రామ్ తో పాటు నిధి అగర్వాల్, నభా నటేశ్ నటిస్తున్న సినిమా విడుదలను జూలై 12 నుంచి 18కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని రామ్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశాడు. 12న వరల్డ్ కప్ ఫైనల్ ఉండటంతోనే నిర్మాతలు చార్మీ, పూరీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
“మామా డేట్ చేంజ్ హువా…కానీ గదే తోపు… గదే తొపు… ఛే దిన్ కే బాద్ 18-07-2019 కీ కిరికిరీ” అని తెలంగాణ యాసలో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై, రామ్ డైలాగ్ డెలివరీ అభిమానులను ఆశ్చర్య పరిచింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ కావడంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి.