telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : పంజాబ్ టార్గెట్ ఎంతంటే…?

ఐపీఎల్ 2021 లో పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో మొదట బేటింగ్ చేసిన ముంబైని పంజాబ్ బౌలర్లు బాగా కట్టడి చేసారు. మొదట 26 పరుగులకే క్వింటన్ డి కాక్ (3), ఇషాన్ కిషన్(6) ఇకెట్లు కోల్పోయిన ముంబై జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి ఆదుకున్నాడు. ఈ క్రమంలో సూర్య కుమార్(33) ఔట్ అయిన రోహిత్ అర్ధశతకం పూర్తి చేసి 63 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. కానీ ఆ తర్వాత పంజాబ్ బౌలర్లు వరుస వికెట్లు తీయడంతో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు పడగొట్టగా దీపక్ హుడా, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే పంజాబ్ 132 పరుగులు చేయాలి. అయితే ఇది చిన్న లక్ష్యాన్ని పంజాబ్ ఛేదిస్తుందా… లేదా అనేది చూడాలి.

Related posts