ఇటీవల పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై జరిగిన ఆత్మాహుతి దాడి గురించి ఏపీసీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటనతో పాక్ కు కూడా సంబంధం లేకపోతే మరి ఇదేమైనా రాజకీయ లబ్దికోసం ప్రధాని నరేంద్ర మోదీ చేయించి ఉంటారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయని అన్నారు. టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, కొందరు వ్యక్తులు తమ స్వార్థం దేశాన్ని ఇష్టమొచ్చినట్టు వాడుకుంటామంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. దేశాన్ని భ్రష్టు పట్టించే చర్యలను అడ్డుకుని తీరాలన్నారు.
కాశ్మీర్ లోని పుల్వామా లో ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి నేపథ్యంలో 44 మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. జరిగి వారం అవుతున్నా, ఇంకా దేశంలో ఈ ఘటన పుట్టించిన వేడి తగ్గలేదు. దేశం మొత్తం ఈ ఘటనపై విరుచుకుపడుతున్నారు. ముష్కరులను తుదముట్టించమని వివిధ మాద్యమాలద్వారా ప్రభుత్వానికి తమ నిర్ణయాన్ని స్పష్టం చేస్తున్నారు. దీనితో మోడీ కూడా ఆర్మీ కి పూర్తి అధికారాలు ఇచ్చినట్టే తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఘటనను రచించిన ముష్కరుల నాయకులను ఆర్మీ వేటాడింది.
ఏపీలో మతమార్పిళ్లు తప్ప మరేం జరగడం లేదు: కన్నా