పోలియో నిర్ములన కోసం దేశవ్యాప్తంగా పిల్లలకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యాధి కాస్త తక్కువగా వినిపిస్తుండటంతో పల్స్ పోలియో కార్యక్రమం కాస్త దూకుడు తగ్గించారు. మళ్ళీ ఈ వ్యాధి ఛాయలు ఉన్నాయని తెలియడంతో పల్స్ పోలియో తిరిగి కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రచారం జరిగినా, సమయానికి కావాల్సిన వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవటంతో వాయిదా వేశారు.
ఫిబ్రవరి 3 న ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉండగా, వ్యాక్సిన్లు కావాల్సినన్ని అందుబాటులో లేకపోవడంతో మార్చి 10 కి వాయిదా వేశారు. 0-5 లోపు వయస్సున్న చిన్నారులకు తల్లిదండ్రులు పోలియో చుక్కలను వేయించాలి.
నాడు 18 సీట్లు నేడు ఒక్కటి .. వర్మ ఆసక్తి కర వ్యాఖ్యలు