telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ స్పీకర్‌కు దిమ్మతిరిగే షాక్‌..

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2005లో తెదేపా నిర్వహించిన ఆందోళన కేసులో పోచారం సహా పలువురికి సమన్లు జారీ చేసింది కోర్టు.
వరంగల్ లోని సుబేదారి పీఎస్ పరిధిలో ఆందోళనకు దిగిన కేసులో సమన్లు జారీ అయ్యాయి. వరంగల్ కోర్టు నుంచి ఈ కేసు ఇటీవల ప్రజా ప్రతినిధుల కోర్టుకు బదిలీ అయింది. ఈ కేసులో ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరికి సమన్లు జారీ కాగా.. ఎస్.వేణుగోపాలచారి, మండవ వెంకటేశ్వరరావు, వేం నరేందర్ రెడ్డికి కూడా సమన్లు జారీ అయ్యాయి. మార్చి 4న హాజరు కావాలని ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశించింది. అటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2016 లో నిర్వహించిన ఆందోళనలో కేపీ వివేకానందకు సమన్లు జారీ చేసింది. ఎమ్మెల్యే వివేకానంద రాష్ట్రంలో లేరని కోర్టుకు తెలిపారు జీడిమెట్ల పోలీసులు. అయితే.. వివేకానందకు వాట్సప్ లేదా మెయిల్ ద్వారా సమన్లు పంపాలని ఆదేశించిన కోర్టు..విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.

Related posts