సీరియస్ చిత్రాల దర్శకుడు మిస్కన్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘సైకో’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఉదయనిధి స్టాలిన్, నిత్యమేనన్, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో ఆసక్తి కనిపిస్తోంది. అందుకు కారణం.. సంగీతజ్ఞాని ఇళయరాజా సంగీతం సమకూర్చడం ఒక కారణమైతే, ‘సైకో’ ట్రైలర్ మరొక కారణం. సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు మిస్కన్ మీడియాతో మాట్లాడుతూ ‘‘నా కెరీర్లో ఇదొక వ్యత్యాసమైన చిత్రం. అనుక్షణం ఉత్కంఠ కలిగిస్తుంది. ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. అయితే పిల్లలు, గర్భిణీలు చూడొద్దనే చెబుతాను. ఎందుకంటే ఇదొక క్రైం స్టోరీ. పలు సన్నివేశాలు చాలా భయంకరంగా ఉంటాయి. 18 ఏళ్లు దాటిని వాళ్లు చూడొచ్చు’’ అని చెప్పారు. ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేరకు థ్రిల్ చేస్తుందో చూడాల్సిందే.
previous post
next post