telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఈటల మీద కేసీఆర్ కక్ష…

మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి, ముతిరెడ్డి మీద ఎందుకు విచారణ జరపలేదని..ప్రత్యర్థులను లొంగ తీసుసుకోవడానికే విచారణలు అని మండిపడ్డారు టీజేఎస్ అధ్యక్షులు ప్రొ. కోదండరాం. కరీంనగర్ లో ఇంకో మంత్రి మీద ఆరోపణలు వచ్చాయి.. ఎందుకు విచారణకు అదేశించలేదన్నారు. విచారణలు లొంగ దిసుకోవడం కోసమే..తప్పితే న్యాయం కోసం కాదని పేర్కొన్నారు.   ఈటెల రాజేందర్ మీద విచారణ జరిపించండి.. నిజాలు నిగ్గు తేల్చా లి.. ఈటెల కూడా అదే డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.   కానీ ఈటెల మీద కక్ష ధోరణితో ఉన్నారని అర్థమైందని.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన వాళ్ళను కెసిఆర్ అణగదొక్కాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.  అరెండ్లలో అదే చూశామని..ఉద్యమ కారులను అణచి వేస్తున్నారన్నారు.   పార్టీ మీద మాకు హక్కు ఉందని… చెప్పిన ఈటలపై కక్షతో కెసిఆర్ ఉన్నారని పేర్కొన్నారు. అయితే చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts