వ్యవస్థ మారనంత కాలం అధికారులపై రాజకీయ నేతలు పెత్తనం చేస్తారని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.హైదరాబాద్ లో రెవెన్యూ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల పని సంస్కృతి మారకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. ఉద్యోగులకు ప్రజల మధ్య ఘర్షణ తలెత్తితే ప్రభుత్వ మనుగడ కష్టమని అన్నారు.
ముందుగా రాజకీయ అవినీతిని అంతం చేయాలని అభిప్రాయపడ్డారు. రాజకీయ అవినీతి పోకుండా, ఉద్యోగుల అవినీతి నిర్మూలన అసాధ్యమని అన్నారు. అవినీతి ఆగాలంటే వ్యక్తిగత నిజాయితీ ఉండాలన్నారు. ఈ సమావేశంలో ‘రెవెన్యూ సంస్కరణలు- సమస్యలు-సూచనలు’ అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఆయా శాఖల అధికారులు, ఉద్యోగుల సంఘం నేతలు పాల్గొన్నారు.