telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆనాడు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం.. ఈనాడు మోదీకి పాదాభివందనం!

Professor Nageshwar Ex mlc

ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల పర్యటన సందర్భంగా ఏపీ సీఎం జగన్  ప్రధాని విమానం దిగగానే ఆయన కాళ్లకు నమస్కరించేందుకు విఫలయత్నాలు చేశారు. దీనిపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ స్పందించారు. మోదీ వయసులో పెద్దవాడు, అత్యున్నత పదవిలో ఉన్నవాడు కావడంతో జగన్ విధేయత ప్రకటించే క్రమంలో పాదాభివందనం చేయడానికి ప్రయత్నించి ఉంటాడని తెలిపారు. అందులో ఎలాంటి తప్పులేదని అన్నారు.

కొన్నినెలల కిందటే పార్లమెంటులో ఇదే నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టిన వైసీపీ అంతలోనే తన వైఖరి మార్చుకుందా? అని నాగేశ్వర్ ప్రశ్నించారు. అప్పుడు చెడ్డవాడుగా కనిపించిన మోదీ, ఇప్పుడు మంచివాడుగా కనిపిస్తున్నాడా? అని అడిగారు. అప్పటికీ ఇప్పటికీ మారింది ఏంటి? ఈ మధ్యకాలంలో మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిందేంటి? అంటూ తనదైన శైలిలో నాగేశ్వర్ పరిస్థితిని వివరించారు.

Related posts