బెదిరింపుల కేసులో పవన్, మహేష్ సినిమా నిర్మాతలకు కోర్టు విముక్తి కలిగించింది. పవన్ కళ్యాణ్, ఎస్.జె.సూర్య కాంబినేషన్లో 2010లో తెరకెక్కిన “పులి” (కొమురం పులి), అలాగే అదే ఏడాది మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన “ఖలేజా”… ఈ రెండు చిత్రాలను ఒకే నిర్మాత శింగనమల రమేష్. ఈ సినిమా వీడియో హక్కుల విషయంలో శింగనమల రమేష్, సి.కళ్యాణ్ కలిసి భానుకిరణ్తో తమని బెదిరించారని షాలిమార్, యూనివర్సల్ వీడియోస్ సంస్థలు వీరిపై కేసులు పెట్టారు. అయితే ఈ కేసు నుండి శింగనమల రమేష్, సి.కళ్యాణ్, భానుకిరణ్లకు నాంపల్లి సీఐడీ కోర్టు విముక్తి ప్రసాదించింది. ఎలాంటి ఆధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్టు సీఐడీ కోర్టు ప్రకటించింది.
previous post
next post
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతం: రవితేజ