telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ నిర్మాత కూతురుకు కరోనా పాజిటివ్

corona

బాలీవుడ్ లో మరో కరోనా పాజిటివ్ కేసు సంచలనం రేకెత్తించింది. కనికా కపూర్ స్నేహితురాలు, బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ కుమార్తె షాజా మొరానీకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ వార్డులో ఆమెకు ప్రస్తుతం డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. షాజా మోరానీ కుటుంబసభ్యులకు కూడా వైద్యులు కరోనా పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. లాక్ డౌన్‌కు ముందే ఆస్ట్రేలియా నుంచి షాజా ఇండియాకు తిరిగొచ్చింది. షారుఖ్ ఖాన్, దీపికా పడుకునే జంటగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ను కరీమ్ మొరానీ నిర్మించారు. ఇప్పుడు బాలీవుడ్‌లో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 748 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో 45మంది చనిపోయారు. దేశ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్నది ఇక్కడే. దీంతో అటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం సామాజిక దూరంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లో ఉంటేనే క్షేమంగా ఉంటున్నారని సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు.

Related posts