telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రియాంక హత్య నన్ను కలచి వేసింది.. నిందితులను ఉరి తీయాలి: రోజా

roja ycp mla

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై వైసీపీ నాయకురాలు రోజా ఘాటుగా స్పందించారు. ఈ ఘటన తనను కలచివేసిందని చెప్పారు. ఈ కేసులోని నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఆడపిల్లపై చేయి వేయాలంటే భయం కలిగేలా శిక్షలు ఉండాలని అన్నారు. కామాంధులకు దుబాయ్ లో వేసే శిక్షలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రియాంక కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు, ఈ కేసులో నిందితులను కాసేపట్లో పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Related posts